వైసీపీ నేతలపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. రౌడీయిజం, భూకబ్జాలు, దౌర్జన్యాలతో విశాఖను భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. విశాఖ ప్రజలు రాజధాని కోరుకోవడంలేదని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. రాజధాని అంశంపై విశాఖ పార్లమెంటు పరిధిలో ఉప ఎన్నిక నిర్వహించి, తేల్చుకుందామని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కు సవాల్ విసిరారు.
విశాఖ పార్లమెంటు స్థానం ఒక్కచోటే ఎన్నికలకు వెళదాం… ప్రజల ఉద్దేశమేంటో తెలిసిపోతుంది… ఈ సవాల్ కు మంత్రి ధర్మాన సిద్ధమా? అని ప్రశ్నించారు. అమరావతి రాజధానా, లేక విశాఖ రాజధానా అనే అంశంపై అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు పోదాం అని చంద్రబాబు కోరితే సీఎం జగన్ పారిపోయారని ఎద్దేవా చేశారు.
గవాస్కర్ వ్యాఖ్యల పై స్పందించిన ఇంగ్లాండ్ ఆటగాడు…