వంగవీటి రాధా వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఏ పార్టీలో చేరకుండా స్తబ్దతగా ఉన్నారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు( కొడాలి నాని) తో వంగవీటి రాధా భేటీ అయ్యారు. గుడివాడ పట్టణంలోని ఫర్నిచర్ పార్క్లో వీరిద్దరు సమావేశమయ్యారు.
వచ్చే ఎన్నికల్లో కాపు ఓట్లు దక్కించుకునేందుకు కొడాలి నాని వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. గుడివాడ నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఓట్లు 24 వేల పైచిలుకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వంగవీటి రాధా మద్దతుతో ఈ ఓట్లు రాబట్టుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. కొడాలి నానితో జరిగిన భేటీలో రాధాకృష్ణ వెంట ఆయనకు అత్యంత సన్నిహితులైన కాపు నాయకులు ఉన్నారు.