telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రభుత్వ చర్యల వల్ల కరోనా అదుపులో ఉంది

తెలంగాణ భౌగోళిక పరిస్థితులు, ప్రభుత్వ చర్యల వల్ల కరోనా అదుపులో ఉందని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. వాక్సిన్ అందుబాటులోకి వస్తే అందరికీ అందించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేస్తామని అన్నారు. కరోనా వైరస్ పై ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై ఈటల సమీక్ష నిర్వహించారు. అమెరికా, యూరప్ దేశాలలో కేసులు పెరుగుతున్న తీరు, భారతదేశంలో ఢిల్లీ, కేరళలో కేసులు పెరుగుతున్న తీరుపై చర్చించారు. ఈసారి వర్షాలు ఎక్కువగా పడటం వల్ల తెలంగాణ లో భూగర్భ జలాలు పెరగడం వల్ల చలి తీవ్రత అంతగా ఉండకపోవచ్చని అంచనా వేశారు. దీంతో వైరస్ ఉదృతి కూడా ఎక్కువగా ఉండకపోవచ్చని మంత్రి ఈటల పేర్కొన్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి తాము వైరస్ బారిన పడకుండా ఉండేలా జాగ్రత్త పడాలని సూచించారు. అదేవిధంగా ఇతరులను కూడా వైరస్ బారినపడకుండా కాపాడాలని విజ్ఞప్తి చేశారు. మాస్కులు, సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఇతర దేశాలలో కేసులు పెరుగుతున్న నేపద్యంలో మన రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సంసిద్ధం ఉందని చెప్పారు.

Related posts