telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రజలు గెలిపిస్తే..పార్టీ మారుతున్నారు: భట్టి విక్రమార్క

CLP Batti vikramarka fire KCR KTR

కాంగ్రెస్‌పై ఉన్న అభిమానంతో ప్రజలు వారిని ప్రజాప్రతినిధులుగా గెలిపిస్తే.. గెలిచినవారు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం పార్టీ మారుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ఆదివారం ఉదయం ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన కాంగ్రెస్ ప్రజాస్వామ్య పరిరక్షణ బస్సు యాత్రను ప్రారంభించారు. .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల పై విమర్శలు గుప్పించారు.

పార్టీ శాసన సభాపక్షాన్ని(సీఎల్పీ) టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేస్తారంటూ వార్తలు కూడా వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వారికి ధీటైన సమాధానం చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజా పరిరక్షణ యాత్ర చేపట్టింది. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో భట్టి విక్రమార్క పర్యటించనున్నారు.

Related posts