దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేసుల సంఖ్య భారీగా పెరుతోంది. సామాన్యుల దగ్గర నుంచి రాజకీయ నాయకులు, సెలబ్రిటీల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు.
తాజాగా..ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. సోరెన్ నివాసంలో మొత్తం 15 మందికి పరీక్షల్లో పాజిటివ్గా తేలింది. వీరిలో సోరెన్ సతీమణి కల్పనా సోరెన్, ఆయన కుమారులు నితిన్, విశ్వజిత్లకు కరోనా నిర్ధరణ అయింది. వారంతా ఇంట్లోనే సెల్ఫ్ క్వారెంటైన్ అయినట్లు తెలిపారు.
అయితే హేమంత్ సోరెన్కు మాత్రం పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. సోరెన్తోపాటు ఆయన మీడియా సలహాదారు, అసిస్టెంట్కు కూడా నెగెటివ్గా తేలింది.
ముఖ్యమంత్రి నివాసంలో ఇప్పటివరకు 62మందికి పరీక్షలు రాంచీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ వినోద్ కుమార్ వెల్లడించారు. మరోవైపు ఝార్ఖండ్లో కొత్తగా 5,081 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మరో ముగ్గురు కొవిడ్తో మృతి చెందారు.
అన్నదాత సుఖీభవ పథకాన్ని రద్దు చేశారు: చంద్రబాబు