telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మహిళలు ప్రతి రంగాన్ని సవాల్ గా తీసుకోవాలి: తమిళిసై

Tamilisai Soundararajan governor

మహిళలు ప్రతి రంగాన్ని సవాల్ గా తీసుకుని ముందుకు సాగాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై పిలుపునిచ్చారు. హైదరాబాద్ ముషీరాబాద్ లో జాగృతి ఫౌండేషన్ నిర్వహించిన మహిళా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్నిఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా తమిళిసై తెలుగులో తన ఉపన్యాసాన్ని ప్రారంభించారు.

మూడు నెలల్లో తెలుగు నేర్చుకుని, మాట్లాడేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. మహిళలు తమకు నచ్చిన ఏదో ఒక రంగాన్ని ఎంచుకుని, అందులో నైపుణ్యతను సాధించాలని చెప్పారు. ముఖ్యంగా ఆరోగ్యంపై మహిళలు శ్రద్ధ చూపాలని సూచించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తో కలిసి ధ్రువపత్రాలను తమిళిసై అందించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ, ఇక్కడ శిక్షణ పొందిన మహిళలు ముద్ర రుణాలు తీసుకోవచ్చని చెప్పారు.

Related posts