సీఎం కేసీఆర్ కు ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విజ్ఞప్తి చేశారు. “సీఎం కేసీఆర్ గారు ప్రజల తరపున నాదొక చిన్న మనవి నీకు, ఉంటే మీ 300 ఎకరాల ఫామ్ హౌస్ లో ఉండండి లేకుంటే ప్రగతి భవన్ లో ఉండండి కానీ ఇంత వర్షం పడే టప్పుడు మాత్రం ఫామ్ హౌస్ టు ప్రగతి భవన్, ప్రగతి భవన్ టు ఫామ్ హౌస్ ప్రయాణం చేయకండి దీనివలన వర్షంలో 60 కిలోమీటర్ల ట్రాఫిక్ ఉండదు, ఆలోచించండి ప్రజలు కూడా సురక్షితంగా ఇంటికి వెళ్లాలి.” అంటూ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజెన్లు కూడా స్పందించారు. “అవును కదా సార్” అంటూ సీఎం కెసిఆర్ సెటైర్ వేశారు నెటిజెన్లు. కాగా నిన్న రాత్రి వరద బాధితులకు ఎమ్మెల్యే సీతక్క నిత్యావసర వస్తువులు పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడారు. ఇటీవలే కురిసిన భారీ వర్షాల కారణంగా ముంపుకు గురైన ఇండ్లను పరిశీలించామని..ముంపుకు గురైన బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసామని పేర్కొన్నారు. కనీస డ్రైనేజీ సిస్టం కూడా మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు అందించలేకపోయారని..70 వేల కోట్లు హైదరాబాద్ డెవలప్మెంట్ కి ఎక్కడ పెట్టారు అని? అని ప్రశ్నించింది.
previous post
next post