తన అన్నయ్య రమేష్ బాబు హఠాన్మరణంతోపై మహేష్ బాబు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. కరోనా సోకడంతో క్వారంటైన్ లో ఉంటున్న మహేష్ బాబు తన అన్నను కడసారిగా చూసుకోలేక పోయారు.
దీంతో సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. మహేష్ బాబు తన అన్నయ్యతో ఉన్న అనుభంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.
“మీరు నాకు స్ఫూర్తి, నువ్వు నా ధైర్యం. .నువ్వే నా సర్వస్వం..
నువ్వు లేకుంటే ఈ రోజు ఉన్న మనిషిలో సగం ఉండేవాడిని కాదు. మీరు నా కోసం చేసిన ప్రతిదానికీ కృతజ్ఞుడను. ఇప్పుడు విశ్రాంతి… విశ్రాంతి…ఒకవేళ నాకు మరో జన్మంటూ ఉంటే నువ్వే నా అన్నయ్యగా రావాలని కోరుకుంటున్నాను..ఇప్పటికీ, ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను” అంటూ ఫేస్ బుక్ లో తన సోదరుడి మృతిపై తీవ్ర భావోద్వేగ పోస్ట్ చేశారు.
గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నరమేష్బాబు శనివారం(జనవరి 8) రాత్రి కన్నుమూశారు. దీంతో ఘట్టమనేని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
రమేశ్బాబు అంత్యక్రియలు జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో పూర్తయ్యాయి. కరోనా పరిస్థితుల వల్ల అతి కొద్దిమంది సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆయన హఠాన్మరణంతో ఆయన ఫ్యామిలీ , టాలీవుడ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది .