సూపర్స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్బాబు అంత్యక్రియలు పూర్తయ్యాయి. జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో రమేశ్ కుమారుడు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కరోనా పరిస్థితుల వల్ల అతి కొద్దిమంది సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆయన హఠాన్మరణంతో ఆయన ఫ్యామిలీ , టాలీవుడ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది .
కొంతకాలంగా రమేష్ బాబు కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. శనివారం రాత్రి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో ఆయనను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రమేష్ బాబు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
కాగా..సూపర్ స్టార్ మహేష్ కడసారి అన్నను చూసుకోలేక పోయారు. కరోనా బారిన పడడంతో క్వారంటైన్ లో ఉంటున్న మహేష్ తన అన్నమరణంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.
మరోవైపు తన కళ్ల ముందే.. విగతజీవిగా పడివున్న కొడుకు రమేష్ బాబుని చూసి చలించిపోయారు సూపర్ స్టార్ కృష్ణ. కన్నీళ్లతో తన కొడుకు రమేష్ బాబుకి నివాళులర్పించారు. కొడుకు భౌతిక ఖాయం పక్కనే కూర్చిండి పోయి కన్నీరుమున్నీరుగా విలపించారు.
కుటుంబ సభ్యులు నరేష్, సుధీర్ బాబు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. రమేష్ బాబుకు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని రమేష్ బాబుకు తుది వీడ్కోలు పలికారు.
పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి సెటైరికల్ పోస్ట్