పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్తో మరోసారి ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. పింక్ రీమేక్ కోసం పవన్ 26 రోజులు కాల్షీట్లు కేటాయించినట్లు వార్తలు వచ్చాయి. క్రిష్ దర్శకత్వంలో పవన్ మరో చిత్రాన్ని చేస్తాడని గాసిప్స్ చక్కర్లు కొట్టాయి. ఇదిలా ఉంటే తాజాగా ఫిలింనగర్లో మరో ఆసక్తికర వార్త హల్చల్ చేస్తోంది. పవన్కల్యాణ్, పూరీ కాంబినేషన్లో వచ్చిన బద్రి, కెమెరామెన్ గంగతో రాంబాబు బాక్సాపీస్ వద్ద మంచి టాక్ను తెచ్చుకున్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్ మరోసారి సిల్వర్స్క్రీన్పై సందడి చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. పవన్ కొత్త సినిమాలపై రకరకాల వార్తలు వస్తున్నా ఇప్పటివరకు అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు. మరి పవన్కళ్యాణ్ పింక్ రీమేక్ షూటింగ్లో ఎప్పుడు జాయిన్ అవుతాడు.? క్రిష్, పూరీ దర్శకత్వంలో సినిమాలు చేస్తాడా..? లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
previous post