ఐపీఎల్ 12వ సీజన్ తుది దశకు చేరుకుంది. నేడు హైదరాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ మైదానంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్లుగా పేరుగాంచిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ టైటిల్ కోసం హోరాహోరీ తలపడేందుకు సిద్ధమయ్యాయి. దీంతో ఈ ఆదివారం.. క్రికెట్ ప్రపంచమంతా హైదరాబాద్వైపే దృష్టి పెట్టింది. దీనికి తోడు టైటిల్ నిర్ణయాత్మక మ్యాచ్ అయిన ఫైనల్కు బాలీవుడ్ మసాలా తోడవనుంది.
ఈ మ్యాచ్లో బాలీవుడ్ జంట సల్మాన్ఖాన్, కత్రినా కైఫ్ హోస్టులుగా వ్యవహరించనున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం ‘భారత్’ జూన్ 5న విడుదల కానుంది. ఈ సినిమాకు ప్రచారం చేసుకునేందుకు వాళ్లు టీవీ స్టూడియోలో కనిపించనున్నట్లు సమాచారం. మ్యాచ్కు ముందు నిర్వహించే కార్యక్రమంలో వాళ్లిద్దరూ పాల్గొననున్నారు. క్రికెట్ అభిమానులకు అటు తమ ఆరాద్య క్రికెటర్లు, ఇటు అభిమాన నటులను ఒకే వేదికపై చూసే అవకాశం కలగనుంది. స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో వచ్చే ప్రీమ్యాచ్ కార్యక్రమంలో వీళ్లిద్దరూ పాల్గొని ఫైనల్ మ్యాచ్ గురించి వాళ్ల అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. మ్యాచ్ ఈ రోజు రాత్రి 7.30గంటలకు ప్రారంభం అవుతుంది.
ఆ వార్తలన్నీపుకార్లే… చై- సామ్ విడాకులపై నాగార్జున క్లారిటీ