ప్రముఖ విప్లవ చిత్రాల దర్శకుడు ధవళ సత్యం తల్లిగారైన ధవళ సరస్వతి ఈ రోజు ఉదయం నర్సాపూర్ లో తుదిశ్వాస విడిచారు. ఆవిడ వయసు 86 సంవత్సరాలు. దర్శకుడు ధవళ సత్యం ఆమె పెద్ద కుమారుడు. రెండవ కుమారుడు ధవళ చిన్నారావు చిత్ర పరిశ్రమలో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా, మూడవ కుమారుడు ధవళ మల్లిక్ దర్శకుడిగానూ స్థిరపడ్డారు. నాలుగవ కుమారుడు లక్ష్మీ నరసింహారావు నర్సాపూర్ కాలేజీలో తెలుగు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా పని చేస్తున్నారు. కాగా తమ తల్లి అంత్యక్రియలు ఈ రోజు నర్సాపూర్ లో జరుగుతాయని ధవళ సత్యం తెలియజేశారు. సినీ ప్రముఖులు పలువురు రాజకీయ ప్రముఖులు ధవళ సత్యంను కలుసుకొని పరామర్శించారు. ఇక ధవళ సత్యం “నేను సైతం”, “ఎర్ర మల్లెలు”, “యువతరం కదిలింది” వంటి విప్లవ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.
చైతన్యతో విడాకుల తర్వాత చనిపోతా అనుకున్నా..