కాజీపేట నుంచి వయా రామగుండం మీదుగా ప్రతిరోజు నడిచే నాగ్పూర్ (అజ్ని)ప్యాసింజర్ రైలును రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. కాజీపేట రైల్వే జంక్షన్ – బల్లార్ష సెక్షన్లో జరుగుతున్న రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 1 వరకు నాగ్పూర్ (అజ్ని)ప్యాసింజర్ రైలును రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేట జంక్షన్-అజ్ని- కాజీపేట జంక్షన్ల మధ్య ప్రతి రోజు రాకపోకలు సాగించే నాగ్పూర్ (అజ్ని)ప్యాసింజర్ రైలులో ప్రయాణించే వారు ఈ అంతరాయాన్ని గమనించాలని అధికారులు కోరారు. తిరిగి ఏప్రిల్ 2నుంచి ఈ రైలు యథావిధిగా నడుస్తుందని వారు చెప్పారు.
previous post
next post
టీడీపీ అందించిన సైకిళ్లకు వైసీపీ స్టిక్కర్లు: నారా లోకేశ్