telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీడీపీ అందించిన సైకిళ్లకు వైసీపీ స్టిక్కర్లు: నారా లోకేశ్

Minister Lokesh comments YS Jagan

టీడీపీ ప్రభుత్వం “బడికొస్తా” కార్యక్రమం కింద స్కూల్ విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ చేసిందని, ఆ సైకిళ్లకు వైసీపీ ప్రభుత్వం “రాజన్న బడిబాట” స్టిక్కర్లు వేసిందని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని స్టిక్కర్లు వేసినా టీడీపీ చేసిన పచ్చబొట్టులాంటి అభివృద్ధిని మరుగున పడేయడం సాధ్యం కాదని ట్విటర్ లో పేర్కొన్నారు.

గత ఐదేళ్లు టీడీపీ చేపట్టిన అభివృద్ధి పనులకు స్టిక్కర్లు వేసుకుంటూ పోతే సీఎం జగన్ కు వచ్చే ఐదేళ్లు కూడా చాలవని హితవు పలికారు. ఈ మేరకు నారా లోకేశ్ ఈరోజు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు బడికొస్తా స్టిక్కర్ పై రాజన్న బడిబాట స్టిక్కర్ ను అంటించిన వీడియోను నారా లోకేశ్ పోస్ట్ చేశారు.

Related posts