కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లోని అమేథీతో పాటు కేరళలోని వాయినాడ్ నుంచి పోటీ చేసేందుకు నిర్ణయించినట్టు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. రెండు లోక్సభ నియోజవవర్గాల్లోనూ రాహుల్ పోటీ చేస్తారని పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సింగ్ సూర్జేవాలా ఆదివారం మీడియా సమావేశంలో తెలిపారు.
ఆమేథీతో పాటు ఈసారి కేరళలోని వాయినాడ్ నుంచి కూడా రాహుల్ పోటీ చేస్తున్నారని సూర్జేవాలా చెప్పారు. రాహుల్ను పోటీ చేయాల్సిందిగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బలంగా కోరారని, అయితే ఎట్టకేలకు వాయినాడ్ నుంచి రెండో స్థానానికి పోటీ చేయాలని రాహుల్ నిర్ణయించారని సూర్జేవాలా తెలిపారు.
ప్రజల దృష్టిని మళ్లించేందుకే షర్మిల వివాదం