మహీంద్రా అండ్ మహీంద్రా.. ఫోర్డ్ ఇండియాను చేజిక్కించుకున్నది. ఫోర్డ్ మోటార్ కో (ఎఫ్ఎంసీ) అనుబంధ సంస్థ ఆర్డౌర్ ఆటోమోటివ్ ప్రైవేట్ లిమిటెడ్లో మెజారిటీ వాటాను సొంతం చేసుకున్నట్లు మంగళవారం మహీంద్రా ప్రకటించింది. అమెరికా ఆటోమోటివ్ దిగ్గజం ఫోర్డ్.. అనుబంధ సంస్థ అయిన ఫోర్డ్ మోటార్ కంపెనీ (ఎఫ్ఎంసీ)లో వాటాలను దక్కించుకున్నట్లు తెలిపింది.
ఒప్పందంలో భాగంగా 51 శాతం వాటాలను మహీంద్రా కొనుగోలు చేయనుంది. మిగలిన 49 శాతం వాటాలు ఎఫ్ఎంసీ నేతృత్వంలోని ఆర్డోర్ చేతిలోనే ఉండనున్నాయి. ఇందులో భాగంగానే ఒక భాగస్వామ్య సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. భారత్లో కొత్తగా ఏర్పాటు చేయనున్న సంస్థ.. ఫోర్డ్ బ్రాండ్ వాహనాలను అభివృద్ధి చేయటమే కాకుండా పంపిణీ చేస్తుందని మహీంద్రా వెల్లడించింది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం దాదాపు రూ.657 కోట్లతో ఈ వాటాను మహీంద్రా దక్కించుకున్నది.