telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఈసారి ఎన్నికలలో కూడా .. ఘనవిజయం సాదించాలి..: కేజ్రీవాల్

kejriwal on his campaign in ap

త్వరలో జరగబోయే దిల్లీ అసెంబ్లీకి ఎన్నికల్లో మరోసారి ఘన విజయం సాధించాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆప్‌ కన్వీనర్‌, సీఎం కేజ్రీవాల్‌ పిలుపునిచ్చారు. 2015లో 70 సీట్లకు గానూ 67 స్థానాల్లో గెలుపొందామని, ఈ సారి ఆ సంఖ్య తగ్గకూడదన్నారు. ఈ మేరకు శనివారం నిర్వహించిన పార్టీ జాతీయ మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ఒక్క నెల మాత్రమే సమయం ఉంది. ఈ సారి మన లక్ష్యం చాలా పెద్దది. గత సారి 67 స్థానాల్లో గెలుపొందాం. ఈ సారి అంతకంటే ఎక్కువే రావాలి తప్ప తక్కువ రాకూడదని కేజ్రీవాల్‌ అని అనడంతో సభ్యులు ’70కి 70′ అంటూ నినాదాలు చేశారు.

అభివృద్ధి నినాదంతోనే ముందుకు వెళ్లాలని కేజ్రీవాల్‌ సూచించారు. హిందూ- ముస్లిం ఎజెండా ఇక్కడ పనిచేయదన్నారు. గత ఐదేళ్లలో ఏం చేశామో అదే చెప్పాలన్నారు. వచ్చే నెలలో దిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆ పార్టీ ఎన్నికలకు సిద్ధమైంది. ఈ సారి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ సేవలను వినియోగించుకోనుంది.

Related posts