ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద కల్యాణ లక్ష్మీ , షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ… నేను తెలంగాణ ఉద్యమ సమయంలో లేకపోయినా…ఈటల రాజేందర్ విషయంలో స్పందించకపోతే తప్పవుతుంది అన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ నిజమైన ఉద్యమకారుడు అయితే ఉద్యమ నాయకుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించే వాడు కాదు. ఈటల వ్యవహరించిన తీరు వల్ల బలహీన వర్గాలు తలదించుకునే పరిస్థితి వచ్చింది. బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు నిజమైన నాయకుడికి ఎల్లవేళలా నమ్మేఉంటారు. రైతు బంధును వ్యతిరేకించిన ఈటెల… తన భూమికి రైతు బంధు చెక్కులు ఎందుకు తీసుకున్నాడు. ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కించపరిస్తే…త్వరలోనే బడుగు బలహీన వర్గాలు ఈటెల రాజేందర్ కు బుద్ధి చెప్తారు అని పేర్కొన్నారు.
previous post