telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఈఎస్‌ఐ స్కామ్ ఆరోపణలపై..ఎలాంటి విచారణకైనా సిద్దం: అచ్చెన్నాయుడు

ache Naidu tdp

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈఎస్‌ఐలో కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై మాజీ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రధాని ఆదేశాల ప్రకారమే పనులు నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. నామినేషన్‌పై వర్క్‌ ఆర్డర్ల ఇవ్వడంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు.

‌తెలంగాణలో ఎలా అమలు చేశారో.. అలాగే అమలు చేశామని తెలిపారు. తాను రాసిన అధికారులకు ఇచ్చిన ఆదేశాల్లోనూ అదే విషయం ఉందన్నారు. అవినీతికి తాను ఎప్పుడూ దూరమేనని స్పష్టం చేశారు. కావాలంటే రికార్డులను పరిశీలించి చర్యలు తీసుకోవచ్చన్నారు. తాను అవినీతికి పాల్పడ్డానని ప్రచారం చేడయం సరైంది కాదన్నారు. ఆనాటి రికార్డులన్ని తన వద్ద ఉన్నాయని తెలిపారు.

Related posts