telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం!

tirumala temple

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సాధారణ సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

టైమ్ స్లాట్ టోకెన్లు, నడకదారి భక్తుల దివ్య దర్శనం, రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతోందని తెలిపారు. నిన్న శ్రీవారిని 67,228 మంది భక్తులు దర్శించుకోగా, 23,633 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ. 3.50 కోట్ల ఆదాయం లభించింది.

Related posts