ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. అయితే తాజాగా దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. తాజా కేసులతో దేశంలో 2.95 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 60,471 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటివరకు ఇండియాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,86,94,879 కి చేరింది. ఇందులో 2,95,70,881 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 9,13,378 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 2726 మంది మృతిచెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,77,031 కి చేరింది. ఇక ఇదిలా ఉంటే, గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 1,17,525 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇకపోతే, దేశంలో ఇప్పటి వరకు మొత్తం 25,90,44,072 మందికి వ్యాక్సిన్ అందించారు.
previous post
అప్పులే తప్ప తన వద్ద డబ్బులేమీ లేవు: ఎమ్మెల్యే జగ్గారెడ్డి