ఈరోజు ఢిల్లీలో సిబిఐ అధికారులను కలిశారు వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత. తన తండ్రి హత్య కేసు దర్యాప్తు బాగా ఆలస్యం అవుతున్న కారణంగా ఆమె కలిసినట్టు చెబుతున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తన తండ్రి హత్య కేసు గురించి మాట్లాడితే బెదిరిస్తున్నారని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. నాన్న హత్య అందరినీ షాక్కు గురి చేసిందని పేర్కొన్న ఆమె వివేకానందరెడ్డి హత్య జరిగి రెండేళ్లు దాటినా ఎవరు హత్య చేశారో ఇప్పటికి తెలియ రాలేదన్నారు. ఇప్పటివరకు దోషులను పట్టుకోలేకపోవడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సీబీఐ అధికారిని కలిసిన సమయంలో కడపలో ఇలాంటి ఘటనలు సాధారణమని చెప్పడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఒక అధికారి అలా ఎలా మాట్లాడుతారని ఆమె ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు తనకు బాధ కల్గించాయన్నారు. మా నాన్నను చంపిన దోషుల్ని పట్టుకోకపోతే ఈ సంస్కృతి ఇలాగే ఉంటుందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. అయితే చూడాలి మరి ఈ కేసు ఎప్పటికి ముగుస్తుంది అనేది.
previous post