రోడ్డు ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని కఠిన నిబంధనలను అమలు చేసినా.. ఓవర్ స్పీడ్తో వెళ్లి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే..తాజాగా తెలంగాణలో మరో ఘోరం చోటుచేసుకుంది. ములుగు జిల్లాలోని పందికుంట క్రాస్ రోడ్డు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. రోజువారీ విధుల్లో భాగంగా ద్విచక్ర వాహనంపై నర్సంపేట డిపోకు కంట్రోలర్ సదానందం, కండక్టర్ సునీత ఇవాళ ఉదయమే బయలు దేరారు. ఈ తరుణంలో మృత్యువు రూపంలో డీసీఎం వాహనం వారి బైక్ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందారు. డీసీఎం వాహనంపై నిర్లక్ష్యంగా వల్లనే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం అందుతోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
previous post