కర్నాటకలో దారుణం చోటుచేసుకుంది. ఫోన్లో ఎక్కువ సేపు మాట్లాడొద్దని మందలించినందుకు యువతి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దొడ్డబళ్లాపుర పట్టణంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో స్నేహ అనే యువతి ఇంటర్ చదువుతోంది. ఆమె వయస్సు 18 ఏళ్లు. అయితే.. ఆ యువతి ఎక్కువగా ఫోన్లో మాట్లాడేది. అది కూడా అబ్బాయిలతో గంటల తరబడి మాట్లాడేది. ఇది గమనించిన తల్లి…. కూతిరిని మందలించింది. ఫోన్లో ఎక్కువ సేపు మాట్లాడొద్దని పలుమార్లు చెప్పింది. అయినా ఆ యువతి ఏ మాత్రం పట్టించుకోకుండా అలాగే మాట్లాడింది. దీంతో ఈసారి కొంచెం గట్టిగానే తల్లి మందలించింది. అంతే స్నేహ తీవ్ర మనస్తాపం చెందింది. ఈ క్రమంలో వారం క్రితం ఇంట్లో పురుగుల మంది తాగి ఆత్మహత్యయత్నం చేసింది. తీవ్ర అనారోగ్యానికి గురైన స్నేహను ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో నిన్న రాత్రి స్నేహ మృతిచెందింది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
previous post
నువ్వు పార్టీ బాకీ ఉన్నావ్… ప్రముఖ నిర్మాతకు ఛార్మి ట్వీట్