చైనా నుండి వచ్చిన మన దేశంతో పాటు ప్రపంచంలోని మిగిత దేశాలను కూడా వణికిస్తోంది. అయితే 2019 వచ్చిన ఈ వైరస్ తీవ్రత రోజు రోజుకు ఎక్కువ అవుతోంది. ఇప్పటికే ఈ వైరస్ భారీన పడ్డారు. ఈ వైరస్ పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ సోకుతోంది. ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది కరోనా బారీన పడ్డారు. అటు క్రీడాకారులను కరోనా వైరస్ వణికిస్తూనే ఉంది. అయితే… ఈ కరోనా వైరస్ కొందరికీ లక్షణాలు లేకున్నా కూడా టెస్టుల్లో పాజిటివ్ వస్తోంది. దీంతో ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే రాజస్థాన్లో చోటు చేసుకుంది. రాజస్థాన్కు చెందిన అప్నాఘర్ ఆశ్రమానికి చెందిన శారద అనే మహిళకు ఎలాంటి లక్షణాలు లేకున్నా… అయిదు నెలల్లో 31 సార్లు కరోనా పాజిటివ్ వచ్చింది. భరత్పూర్ జిల్లాలోని ఆర్బీఎం ఆస్పత్రిలో ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతోంది. గత ఏడాది ఆగస్టు 20వ తేదీన ఆమెకు తొలిసారి కరోనా పరీక్ష చేయగా కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పటి వరకు శారధకు 31 సార్లు కరోనా పరీక్షలు చేశామని.. ప్రతిసారీ ఆమెకు పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ భరద్వాజ్ చెప్పాడు. అయితే.. ఆమెకు ఎలాంటి కరోనా లక్షణాలు లేకున్నా.. పాజిటివ్ వస్తుందని కూడా పేర్కొన్నారు.
previous post
తనను ఓడించేందుకు వంద కోట్లు: పవన్