ఉగాది పర్వదినాన మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రేక్షకులకు, అభిమానులకు తెలుగువారి నూతన సంవత్సరాది శుభాకాంక్షలు తెలుపుతూ కరోనా కట్టడికి కృషి చేయాలని ట్వీట్ చేశారు. ఇక ఇన్స్టాగ్రామ్లో ఖాతా తెరిచిన చిరు తల్లి అంజనాదేవితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేయడం విశేషం. కొన్నాళ్ల క్రితం మెగాపవర్ స్టార్ రామ్చరణ్.. రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి తమకు అమ్మలతో ఉండే అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మెగా పవర్స్టార్ రామ్చరణ్ సోషల్ మీడియాలో భాగమైన ఇన్స్టాగ్రామ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు తల్లి సురేఖతో ఉన్న ఫోటోను తొలి ఇన్స్టా మెసేజ్గా షేర్ చేసుకున్నారు. అలాగే ఈ ఉగాదికి ఇన్స్టాగ్రామ్లో ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి కూడా తన తల్లి అంజనా దేవీతో ఉన్న ఫోటోను తొలి మెసేజ్గా షేర్ చేసుకున్నారు. ఇలా ఇద్దరు మెగా హీరోలు అమ్మతో తనకున్న అనుబంధాన్ని తెలియజేశారు. చిరు అమ్మగారితో కలిసి ఉన్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా ఫ్యాన్స్ ఈ ఫోటోను తెగ షేర్ చేస్తున్నారు.
previous post