telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఐదో రోజూ టీడీపీ సభ్యుల సస్పెండ్‌

ఐదో రోజూ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ ప్రారంభం కాగా నే టీడీపీ సభ్యులు మరో సారి సస్పెన్షన్‌కు గురయ్యారు. సభా సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని స్పీకర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వరుసగా 5వ రోజు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ అయ్యారు. 10 మంది టీడీపీ సభ్యులను ఒక రోజు సస్పెండ్ చేశారు స్పీకర్. సభలో టిడిపి సభ్యుల ఆందోళన కొనసాగుతున్నది. ఉపాధి హామీ పెండింగ్ బిల్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో స్పీకర్ పోడియం వద్దకు వెళ్లారు టిడిపి సభ్యులు. దీంతో 10 మంది సభ్యులను సస్పెండ్ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు మంత్రి పేర్ని నాని. 10 మంది టిడిపి సభ్యుల సస్పెన్షన్ వేటు వేశారు స్పీకర్‌. అచ్చెన్నాయుడు, రామానాయుడు, అనగాని సత్య ప్రసాద్, ఏలూరు సాంభశివరావు, జోగేశ్వర రావు, రామ రాజు, రామకృష్ణ బాబు, బాల వీరాంజనేయ స్వామి, అశోక్, బుచ్చయ్య చౌదరి సస్పెన్ష్‌ అయిన వారిలో ఉన్నారు.

Related posts