ఏపీ ఆర్టీసీ కార్మిక సంఘం సమ్మె సైరన్ మోగించింది. జూన్ 13 నుంచి తాము నిరవధిక సమ్మెకు వెళ్లనున్నట్టు ఉద్యోగ సంఘాలు కొద్దిసేపటిక్రితం ప్రకటించాయి. ఎంతోకాలంగా తమ న్యాయమైన కోరికలను తీర్చేందుకు యాజమాన్యం శ్రద్ధ చూపలేదని, ఆర్టీసీలో వేల కొద్దీ ఖాళీలను భర్తీ చేయకుండా, ఉన్నవారిపై ఒత్తిడిని పెంచుతున్నారని ఆరోపించిన ఉద్యోగ సంఘాల నేతలు, తప్పని సరి పరిస్థితుల్లోనే సమ్మెకు దిగాలని నిర్ణయించినట్టు తెలిపాయి.
సమ్మె చేసేప్పుడు ప్రజలు తమ సమస్యలను అర్థం చేసుకుని సహకరించాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కోరారు. ఆర్టీసీ యాజమాన్యం కార్మిక వర్గాలను రెచ్చగొట్టి, చీలిక తేవడం ద్వారా సమ్మెను నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తున్నట్టు తమకు సమాచారం ఉందని, అటువంటివి జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరించారు. సమస్యల పరిష్కారం దిశగా యాజమాన్యానికి మరోమారు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే జూన్ 13ను సమ్మె తేదీగా ప్రకటిస్తున్నామని తెలిపారు.
వాళ్ళను రెచ్చగొడుతున్నారు… “సైరా” వివాదంపై చిరు సంచలన వ్యాఖ్యలు