telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

భారత్-ఆసీస్ మూడో మ్యాచ్ డ్రా…

ప్రస్తుతం భారత్-ఆసీస్ జరిగిన మూడో మ్యాచ్ మాత్రం ఫలితం తేలకుండా డ్రా గా ముగిసింది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 338 కి ఆల్ ఔట్ అయ్యింది. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన భారత్ 244 కే కుప్పకూలిపోయింది. ఇక మళ్ళీ రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లు కోల్పోయి 312 పరుగులు చేసిన ఆసీస్ డిక్లైర్ ఇవ్వడంతో భారత్ ముందు 406 పరుగుల లక్ష్యం ఉంది. ఇక నిన్న మూడో సెషన్ లో ఛేదన ప్రారంభించిన భారత్ ఆట ముగిసే సమయానికి 98 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. కానీ ఈరోజు ఆట ప్రారంభమైన కాసేపటికే కాసేపటికే కెప్టెన్ రహానే(4) పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు. కానీ ఆ తర్వాత వచ్చిన బ్యాటింగ్ కు వచ్చిన పంత్ అలాగే పుజారా నిలకడగా రాణిస్తూ అర్ధశతకాలు బాదడంతో భారత్ పటిష్టమైన స్థితిలో నిలిచింది. కానీ వీరు ఔట్ అయిన తర్వాత బ్యాటింగ్ కొనసాగించిన అశ్విన్, విహారి తమ తర్వాత బ్యాటింగ్ చేయగల ఆటగాడు ఎవరు లేకపోవడంతో నెమ్మదిగా వికెట్లు పడకుండా జాగ్రత్తగా ఆడుతూ మ్యాచ్ ను డ్రా వైపుకు నడిపించారు. అయితే నాలుగు టెస్టుల ఈ సిరీస్ లో ప్రస్తుతం 1-1 తో సమానంగా ఉన్నాయి భారత్, ఆసీస్. ఇక మిగిలిన చివరి టెస్ట్ లో ఎవరు విజయం సాధిస్తే… సిరీస్ వారిదే.

Related posts