telugu navyamedia
రాజకీయ వార్తలు

శరద్ పవార్ కు భారీ ఆఫర్ చేసిన బీజేపీ?

Loksabha Elections MP Contest Sharad pawar

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు బీజేపీ భారీ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతిస్తే తదుపరి రాష్ట్రపతి పదవిని పవార్‌కు బీజేపీ ఆఫర్‌ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఎటువంటి అధికారిక ప్రకటనా, సమాచారం లేకున్నా, దీన్ని గురించి చర్చించేందుకే మోదీని పవార్ కలవనున్నారని తెలుస్తోంది.

అయితే, మహారాష్ట్రలో రైతుల సమస్యల గురించి ప్రధానితో మాట్లాడేందుకు మాత్రమే పవార్ న్యూఢిల్లీకి వెళ్లారని ఎన్సీపీ చెబుతోంది. కాగా, మోదీని కలిసిన తరువాత, సాయంత్రం సోనియా గాంధీని శరద్ పవార్ కలవనున్నారు. ఇక బీజేపీకి మద్దతిచ్చేందుకు ఎన్సీపీ అధినేత అంగీకరిస్తారా? అన్న విషయమై నేడు స్పష్టం కానుంది.

Related posts