telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఎస్ఈసీ ప్రభుత్వం మీద అసహనం వ్యక్తం చేయటం దురదృష్టకరం…

Ambati Rambabu ycp

వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చంద్రబాబు, నిమ్మగడ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజాస్వామ్యంలో లేని అధికారాన్ని ప్రదర్శించాలనుకుంటే మూల్యం చెల్లించక తప్పదు అని హెచ్చరించారు. ఇక ఎస్ఈసీ ప్రభుత్వం మీద అసహనం వ్యక్తం చేయటం దురదృష్టకరం. నిమ్మగడ్డ రాజ్యాంగ స్ఫూర్తి తో కాకుండా చంద్రబాబు స్ఫూర్తితో పని చేస్తున్నారు అని అంబటి అన్నారు. . చంద్రబాబు పంచాయతీ ఎన్నికలకు మ్యానిఫెస్టో రిలీజ్ చేశారు. చంద్రబాబుకు పిచ్చి ముదిరింది. రాజకీయాలతో సంబంధం లేని గ్రామ పంచాయతీ ఎన్నికలకు మ్యానిఫెస్టో ఎలా విడుదల చేస్తారు అని ప్రశ్నించారు. ఇప్పుడు నిమ్మగడ్డ ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలి. తన ఓటు హక్కును దుగ్గిరాల లో తిరస్కరించారని నిమ్మగడ్డ చెప్పారు. హైదరాబాద్ లో ఉండే వ్యక్తి కి దుగ్గిరాలలో ఓటు ఎలా ఇస్తారు? ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన పోటుగాడు చంద్రబాబే అని అన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండీ దిగజారడు భాష మాట్లాడటం దురదృష్టకరం అని పేర్కొన్నారు. బీజేపీ-జనసేనకు ఎన్నికల తో ఏం సంబంధం? రాజకీయాలకు అతీతంగా జరిగే ఎన్నికలను రాజకీయంగా మార్చాలనుకుంటున్నారా? ఏకగ్రీవం అంటే ఏ పార్టీ మద్దతుదారు అయినా కావచ్చు కదా అని తెలిపారు. చూడాలి మరి ఈ వ్యాఖ్యల పై నిమ్మగడ ఎలా స్పందిస్తారు అనేది.

Related posts