సీఎం కేసీఆర్ మరోసారి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. రైతుబంధు నిధుల విడుదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో జరిగే ఈ సమావేశంలో వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులు పాల్గొననున్నారు. ఈ ఏడాది రెండో విడత రైతుబంధు సహాయం కోసం నిధుల విడుదల, పంపిణీపై ఈ మీటింగ్లో సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. కాగా.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలిన విషయం తెలిసిందే.. గ్రేటర్ ఎన్నికల్లో ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటలేకపోయింది. ముఖ్యంగా బీజేపీ పార్టీ టీఆర్ఎస్కు నిద్ర పట్టకుండా చేసింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ రేపు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ వైఫల్యాలు చర్చకు వస్తాయని సమాచారం. భవిష్యత్తులో బీజేపీని ఎలా ఎదురుకోవాలనే దానిపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
previous post