telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కాలేజీల్లో మధ్యాహ్న భోజనం!

KCR cm telangana

విద్యావ్యవస్థను పటిష్టం చేసేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కళాశాల్లో ఇప్పటికే అనేక సంస్కరణలు చేపట్టిన ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

ఉదయం కాలేజీలకు వచ్చిన విద్యార్థులు మధ్యాహ్ననికి మళ్లీ వెళ్లిపోతున్నారని, దీని వల్ల ప్రభుత్వ కాలేజీల్లో డ్రాపవుట్స్ పెరిగిపోతున్నారని అధికారులు గతంలో సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై శుక్రవారం విద్యాశాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి.. కాలేజీల్లో భోజన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లో విద్యార్థుల హాజరుశాతం పెరగాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.

Related posts