కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ జీపు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది కార్మికులు మృతి చెందగా, 12మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ దుర్ఘటన కర్ణాటక తమకూరు జిల్లాలోని శిరా తాలూకా కలకంబెల్లా సమీపంలో గురువారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను తుమకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ప్రమాదానికి గురైన వారంతా రోజువారీ కూలీలు. బెంగళూరుకు వెళ్తుండగా ఘటన జరిగినట్లు వివరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదానికి గురైన జీప్లో 20 మంది ఉన్నారని, 9 మంది అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు. మృతులంతా రాయచూరు జిల్లాకు చెందిన వారని తెలిపారు పోలీసులు.
మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు వెల్లడించారు. మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు