telugu navyamedia
రాజకీయ వార్తలు

జార్ఖండ్‌ : …మూడో దశ పోలింగ్‌లో .. 62.6శాతం ఓటింగ్..

62.6 percent polling in 3rd phase

అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మూడో దశ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఎనిమిది జిల్లాల్లో 17 సీట్లకు జరుగుతోన్న ఈ ఎన్నికల్లో 56 లక్షల మంది (62.6 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని జార్ఖండ్‌ ప్రధాన ఎన్నికల అధికారి వినయ్‌ కుమార్‌ చౌబే వెల్లడించారు. వీరిలో 26 లక్షల మంది మహిళలు, 86 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారని తెలిపారు. పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. రాంచి, హటియా, కాంకే, బర్ఖాతా, రామ్‌గర్‌లలో సాయంత్రం 5 గంటల వరకు.. మిగతా ప్రాంతాల్లో సాయంత్రం 3 గంటల వరకు పోలింగ్‌ జరిగింది.

Related posts