ఒడిశాలో కరోనా మహమ్మారి విజృంభించడంతో భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలో తాజాగా 3,219 కేసులు నిర్ధారణ అయ్యాయని ఒడిశా ఆరోగ్యశాఖ తెలిపింది. సెప్టెంబర్ 1న 3,484 మంది వైరస్ నుంచి కొలుకొని డిశ్చార్జి అయ్యారు. అలాగే వైరస్ ప్రభావంతో కొత్తగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కేసుల సంఖ్య 1,09,780 ఉండగా.. 80,770 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 28,443 క్రియాశీల కేసులుండగా, 514 మంది మరణించారు. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కటక్లో 400, బాలంగీర్లో అత్యల్పంగా 10 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ వివరించింది.