telugu navyamedia
క్రైమ్ వార్తలు

ఆటోను ఢీకొట్టిన లారీ…. ముగ్గురు కూలీలు దుర్మరణం

తెలంగాణలోని హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శాయంపేట మండలంలోని మాందారిపేట వద్ద శుక్రవారం తెల్లవారుజామున కూలీలతో వెళ్తున్న ఆటో ట్రాలీను ఇసుక లారీ ఢీకొట్టింది.

ఈ ప్ర‌మాదంలో ముగ్గురు మహిళా కూలీలు మృతిచెంద‌గా.. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఈ ఘ‌ట‌న హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మాందారి పేట శివారులోని కస్తూర్బా పాఠశాల సమీపంలో ఈ విషాదం చోటుచేసుకుంది. మృతులు రేణుక, మంజుల, నిర్మలగా గుర్తించారు.

బాధితులు అంతా పత్తిపాక గ్రామానికి చెందిన కూలీలు మొగుళ్లపల్లి మండలంలో మిరప తోటలో కాయలు ఏరడానికి టాటా ఏస్‌ వాహనంలో వెళ్తుండగా… లారీ వచ్చి ఢీకొట్టింది. వెల్లడించారు.ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts