*వికారాబాద్ గ్రామ శివారులో బాలిక హత్య
*బండరాయితో మోదీ హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
*తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్ళిన 15ఏళ్ళ బాలికపై దారుణం
* అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు..
వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పూడూరు మండలం అంగడిచిట్టంపల్లిలో 10వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం చేసి.. ఆ తరువాత బండరాయితో మోదీ హత్య చేసినట్టుగా అనుమానిస్తున్నారు. అయితే ఈ హత్య వెనక ప్రేమ వ్యవహారం అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
వివర్లాలోకి వెళితే..
బాలిక తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్ళిన సమయంలో గుర్తుతెలియని తెలియని వ్యక్తులు హత్య చేశారు… రాయితో మోది బాలికను చంపేసిన వారు అక్కడి నుంచి పరారయ్యాడు.
కాగా ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు స్పందించారు. ఓ యువకుడిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డను ప్రేమ పేరుతో వేధించేవాడని, అతడు, అతడి స్నేహితుల బాలిక మృతికి కారణమమని ఆరోపించారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ముగ్గురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఘటనా స్థలాన్ని ఎస్పీ కోటిరెడ్డి పరిశీలించారు. ప్రియుడిపై విద్యార్థిని తల్లిదండ్ులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.