యాదాద్రిలో లక్ష్మినరసింహస్వామి ఆలయం పునః ప్రారంభమైంది.లక్ష్మీ నర్సింహుడికి సీఎం కేసీఆర్ దంపతులు తొలి పూజ చేశారు. ఆరేళ్ల తర్వాత యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి గర్భాలయంలోని మూలవిరాట్ నిజరూపంలో దర్శనమిచ్చారు.
తొలుత ప్రధానాలయం గోపురాలపై ఉన్న కలశాలకు కుంభాభిషేకం, సంప్రోక్షణ వైభవంగా జరిగింది. ఏడు రాజగోపురాలపై ఉన్న కలశాలకు ఏకకాలంలో 92 మంది రుత్వికులతో సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు కుంభాభిషేకం, సంప్రోక్షణ నిర్వహించారు. వేదమంత్రోచ్ఛరణ నడుమ సంప్రోక్షణ క్రతువు వైభవోపేతంగా జరిగింది.
మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవం తర్వాత ప్రధాన ద్వారం నుంచి సీఎం కేసీఆర్, మంత్రులు ప్రధానాలయంలోని మండపంలోకి ప్రవేశం చేశారు.. ఉపాలయాల్లో ప్రతిష్ఠా మూర్తులకు మహా ప్రాణన్యాసం నిర్వహించారు. స్వయంభువుగా వెలసిన స్వామివారికి
సీఎం కేసీఆర్ దంపతులు స్వామివారికి తొలి పూజ చేశారు.
అనంతరం అర్చకులు ఆరగింపు సేవ చేశారు. తర్వాత తీర్థ, ప్రసాద గోష్టి జరిగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది.
అలాగే యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో పాలుపంచుకున్న వారిని సీఎం కేసీఆర్ సన్మానించారు. ఆర్కిటెక్ ఆనందసాయి, ప్రధాన స్తపతి సుందర్ రాజన్, ఈవో గీతారెడ్డి, రుత్వికులు, పూజారులను సీఎం సన్మానించారు.