telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కరోనా విధ్వంసం సృష్టిస్తుంటే..సెక్రటేరియట్ కు వందల కోట్లా?: రేవంత్

Revanth-Reddy mp

తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణానికి వందల కోట్లు విడుదల చేయడంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కరోనా విధ్వంసం సృష్టిస్తుంటే పేదల కోసం నిధులు ఖర్చు చేయలేదు కానీ, సోకుల కోసం సచివాలయానికి వందల కోట్లా? అంటూ ప్రశ్నించారు. సెక్రటేరియట్ నిర్మాణానికి రూ.400 కోట్లు విడుదల అంటూ మీడియాలో వచ్చిన వార్త క్లిప్పింగ్ ను కూడా రేవంత్ రెడ్డి తన ట్వీట్ కు జోడించారు.

సచివాలయం జి బ్లాక్‌లో గుప్తనిధులపై ఎంపీ రేవంత్ రెడ్డి మొదటి నుంచి ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అలాగే కూల్చివేతలో భాగంగా నల్లపోచమ్మ గుడి, మసీదులను కూల్చడాన్ని కాంగ్రెస్ సీరియస్‌గా పరిగణిస్తోంది. కూల్చివేత సందర్భంగా వాస్తవంగా ఏం జరుగుతోందో పరిశీలించేందుకు క్షేత్ర పర్యటనకు అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. నేడు లేదా సోమవారం ఈ పిటిషన్‌పై విచారణ జరగొచ్చని భావిస్తున్నారు

Related posts