telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్‌ ఓర్‌ఆర్‌ఆర్‌పై ఘోర ప్రమాదం.. స్వాట్‌లోనే ముగ్గురు మృతి

హైదరాబాద్‌ : శామీర్‌పేట్‌ సమీపంలోని ఔటర్‌రింగు రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్‌ చిలుకానగర్‌కు చెందిన కరుణాకర్‌రెడ్డి (46), భార్య సరళ (38), ఆమె చెల్లెలు సంధ్య (30)తో కలిసి కారులో గజ్వేట్‌లోని ఓ శుభకార్యానికి హాజరై తిరుగు పయనమయ్యారు. ఈ తరుణంలో శామీర్‌పేట్‌ ఓఆర్‌ఆర్‌ గుండా ఉప్పల్‌కు వెళుతుండగా లియోనియా సమీపంలో ముందుగా వెళుతున్న కంటైనర్‌ను వెనుక నుంచి ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కరుణాకర్‌రెడ్డి, సరళ, సంధ్యలు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Related posts