telugu navyamedia
వార్తలు సామాజిక

మద్యం మత్తులో విద్యార్థుల చిందులు.. కళాశాల నుంచి బహిష్కరణ!

liquor shops ap

మద్యం సేవించి చిందులేసిన నలుగురు విద్యార్థులను కళాశాల యాజమాన్యం బహిష్కరించింది. వివరాల్లోకి వెళితే… తమిళనాడు రాష్ట్రం నాగపట్నంలోని ఓ కళాశాలలో చదువుకుంటున్న నలుగురు విద్యార్థులు ఆరు వారాల క్రితం పార్టీ చేసుకున్నారు. వీరిలో ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. పార్టీలో అమ్మాయిలు, అబ్బాయిలు బీరుతాగారు. దీన్ని ఓ విద్యార్థి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు.

అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడ్డారు. తమిళనాడులో 21 ఏళ్ల వయసులోపు ఉన్న వారు మద్యం సేవిం చడం చట్ట ప్రకారం నేరం. వారితో కలిసి అమ్మాయిలు కూడా మద్యం సేవించడంతో నెటిజట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వారిపై చర్యకు డిమాండ్ చేశారు. ఇది కాస్తా వైరల్ కావడంతో విషయం డిసెంబరు 27 కళాశాల యాజమాన్యం దృష్టికి వెళ్లింది. దీంతో ప్రిన్సిపాల్ అంతర్గత విచారణకు ఆదేశించారు. విద్యార్థుల తీరు కళాశాలకు చెడ్డ పేరు తెచ్చేదిగా ఉండడంతో వారిని బహిష్కరించాలని నిర్ణయించారు.

Related posts