telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

40 శాతం పెరగనున్న జియో చార్జిలు!

Reliance_jio tariff

టెలికాం సంస్థలు వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్‌లు ప్రీపెయిడ్ మొబైల్ టారిఫ్‌లను పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయా సంస్థలు పెంచిన ధరలు ఈ రోజు అర్ధరాత్రి నుంచే అమలులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 6 నుంచి జియో కూడా మొబైల్ టారిఫ్‌లను పెంచుతున్నట్లు తెలిపింది.

మొబైల్ టారిఫ్‌ల పెంపులో భాగంగా జియో డిసెంబర్ 6వ తేదీన నూతన ఆలిన్ వన్ ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న ప్లాన్ల ధరలు 40 శాతం వరకు పెరుగుతాయని జియో వెల్లడించింది. అయితే పెంచిన చార్జిలకు అనుగుణంగా కస్టమర్లకు ప్రయోజనాలను అందిస్తామని జియో తెలిపింది. ఈ క్రమంలోనే నూతన ప్లాన్లపై 300 శాతం అదనపు ప్రయోజనాలను అందిస్తామని వెల్లడించింది.

Related posts