ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలైన బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పోటాపోటీగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బీజేపీకి సీఎం అభ్యర్థి విషయంలో సవాలు విసిరారు. దమ్ముంటే సీఎం అభ్యర్థిని ప్రకటించండి. ఢిల్లీ ప్రజలు బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించాలని కోరుకుంటున్నారు. సీఎం ఎవరో ప్రజలు నిర్ణయించాలి కానీ అమిత్షానో, మోదీనో కాదని కేజ్రీవాల్ అన్నారు.
బీజేపీ బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటలోపు ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు ప్రకటించాలని డెడ్లైన్ విధించారు. అంతేకాదు బీజేపీ సీఎం అభ్యర్థితో బహిరంగచర్చలకు తాను సిద్దంగా ఉంటానని చెప్పారు. ఒకవేళ బీజేపీ తమ సీఎం అభ్యర్థిని ప్రకటించకపోతే మరో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని తెలిపారు.