పంజాబీ పాత్రల్లో నటించిన మన్మీత్ గైవాల్(32) అనే టీవీ నటుడు ముబాయిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులతో కలత చెందడం వల్లే శుక్రవారం రాత్రి ముంబైలోని తన స్వగృహంలో ఉరేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా పంజాబ్కు చెందిన అతను ప్రస్తుతం ముంబైలోని ఖర్గార్లో తన భార్యతో కలిసి నివసిస్తున్నాడు.
లాక్డౌన్ వల్ల అన్ని రంగాలతో పాటు సినీరంగానికి బ్రేక్ పడింది. షూటింగ్లు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ఉపాధి లేక ఆర్థిక కష్టాలు అతన్ని వెంటాడాయి. దీంతో అతను తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. ఈ క్రమంలోనే అతను ఉరేసుకుని చనిపోయినట్లు అతని ఫ్యామిలీ ఫ్రెండ్ మంజీత్ సింగ్ రాజ్పుత్ మీడియాకు వెల్లడించాడు.
కాగా మన్మీత్ ‘ఆదత్ సే మజ్బూర్’, ‘కుల్దీపాక్’ వంటి సీరియల్స్లో నటించి ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నాడు. పలు టీవీ కార్యక్రమాలతో పాటు వాణిజ్య ప్రకటనలలో కూడా కనిపించాడు. ఈ మేరకు పొలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.