telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

దూబే ఎన్ కౌంటర్ పై స్పందించిన కుటుంబ సభ్యులు

Vikas_dubey up

ఉత్తర్ ప్రదేశ్ గ్యాంగ్ స్టార్ వికాస్ దూబేను పోలీసులు ఎన్ కౌంటర్ లో కాల్చి చంపడంపై కుటుంబ సభ్యులు స్పందించారు. వికాస్ దూబే భార్య రిచా మాట్లాడుతూ ఎన్ కౌంటర్ చేయడం సబబేనని పేర్కొన్నారు. తన భర్త ఘోరానికి పాల్పడ్డాడని, ఇలాంటి శిక్షకు అర్హుడేనని చెబుతూ బోరున విలపించారు. పటిష్ట బందోబస్తు మధ్య వికాస్ దూబే అంత్యక్రియలు కాన్పూర్ లోని భైరవ్ ఘాట్ లో నిర్వహించగా, భార్య, చిన్న కుమారుడు, బావమరిది దినేశ్ తివారీ తప్ప ఇతర కుటుంబ సభ్యులెవరూ హాజరుకాలేదు.

దూబే తండ్రి రామ్ కుమార్ సైతం కుమారుడి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు నిరాకరించారు. ఎన్ కౌంటర్ పై ఆయన మాట్లాడుతూ, తన కుమారుడు ఎనిమిది మంది పోలీసులను చంపాడని అన్నారు. తద్వారా క్షమించరాని నేరం చేశాడని వ్యాఖ్యానించారు. తమ మాట ఎప్పుడూ వినలేదని చెప్పారు. పెద్దల మాట వినుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని స్పష్టం చేశారు.

Related posts