తన త్యాగంతోనే మునుగోడు అభివృద్ధి జరుగబోతోందని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. మూడున్నరేళ్లుగా మునుగోడు ప్రజా సమస్యల కోసం పోరాడుతున్నానని అన్నారు.
రాజకీయంలోకి రాకముందే తాను వ్యాపారవేత్తను, వ్యాపారం కోసమే రాజకీయం చేసే గుణం తనది కాదన్నారు. ఈ నెల 20న కేసీఆర్ హాజరయ్యే సభలో మూడున్నరేళ్లుగా మునుగోడుకు ఎన్ని నిధులు ఇచ్చారో ప్రజలకు చెప్పాలని రాజగోపాల్ రెడ్డి. డిమాండ్ చేశారు.
మునుగోడు ప్రజలు ధర్మం వైపే ఉంటారని, తనను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారని అన్నారు. ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారనే నమ్మకం తనకు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.
మూడేన్నరేళ్ళలో పట్టించుకోని వీరంతా రేపటి నుంచి డబ్బు సంచులతో తిరుగుతారని టీఆర్ఎస్ నేతలనుద్దేశించి విమర్శలు గుప్పించారు.
12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని దుయ్యబట్టారు. మునుగోడు ప్రజలకు, కేసీఆర్ కు జరుగుతున్న యుద్ధమే వచ్చే ఉప ఎన్నిక అని వ్యాఖ్యానించారు
కేటీఆర్ ఫోన్ చేయగానే ఈటల తుస్సుమనిపించాడు: రేవంత్ రెడ్డి