telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

దిశ కేసు నిందితులకు ఏడు రోజుల పోలీస్ కస్టడీ!

New couples attack SR Nagar

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన దిశ కేసులో నలుగురు నిందితులను ఏడు రోజుల పోలీస్ కస్టడీకి షాద్ నగర్ కోర్టు అనుమతించింది. రేపటి నుంచి నిందితులను పోలీసులు విచారించనున్నారు. ప్రస్తుతం నిందితులు చర్లపల్లి జైల్లో రిమాండ్ లో వున్నారు.

భారీ భద్రత మధ్య నిందితులను సంఘటనా స్థలానికి తీసుకెళ్లేందుకు పోలీసులు ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. నిందితులను అదుపులోకి తీసుకోవాలా లేక జైల్లోనే వారిని విచారించాలా? అనే దానిపై పోలీసులు తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం. నిందితులపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దృష్ట్యా వారిని జైల్లోనే విచారించే అవకాశాలు వున్నట్టు తెలుస్తోంది.

Related posts