కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ అవార్డు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తి కరణ్ పురస్కార్.. కు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైన గ్రామ, మండల, జిల్లా పరిషత్ ప్రజా ప్రతినిధులను ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రగతి భవన్ లో సన్మానించారు. అయితే వారిలో.. కరీంనగర్ జిల్లా పర్లపల్లి గ్రామ సర్పంచ్ మడది భారతి , రాజన్న సిరిసిల్ల జిల్లా హరిదాస్ నగర్ గ్రామ సర్పంచ్ తెడ్డు అమృత, సిద్దిపేట జిల్లా మిట్టపల్లి గ్రామ సర్పంచ్ వంగ లక్ష్మి , సిద్దిపేట జిల్లా మల్యాల గ్రామ సర్పంచ్ దరిపల్లి వజ్రవ్వ , ఆదిలాబాద్ జిల్లా రుయ్యాడి గ్రామ సర్పంచి పుండ్రు పోతా రెడ్డి , మహబూబ్ నగర్ జిల్లా చక్రాపూర్ గ్రామ సర్పంచ్ కే. శైలజ, పెద్దపల్లి జిల్లా సుందిళ్ల గ్రామ సర్పంచ్ దాసరి లక్ష్మి ,రాజన్న సిరిసిల్ల జిల్లా మోహిని కుంట గ్రామ సర్పంచ్ కల్వకుంట్ల వనజ, జగిత్యాల జిల్లా కోరుట్ల ఎంపీపీ తోట నారాయణ, పెద్దపల్లి జిల్లాల ధర్మారం ఎంపీపీ ముత్యాల కరుణ, సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పటోళ్ల మంజుశ్రీ, సంగారెడ్డి జడ్పీ సీఈవో సీహెచ్ ఎల్లయ్య, పెద్దపల్లి డీపీవో గీత ఉన్నారు.
previous post
next post
రాష్ట్రంలో దుర్మార్గం రాజ్యమేలుతోంది: లోకేశ్