‘ఉప్పెన’తో హీరోగా పరిచయమై న పంజా వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు పొందాడు. రెండో ప్రయత్నం.. ‘కొండపొలం’ చిత్రంతో యువతలో స్ఫూర్తినింపిన ఆయన ప్రస్తుతం ‘రంగరంగ వైభవంగా’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రం విడుదల కాక ముందే మరో కొత్త సినిమాకు గ్రీన్సిగ్నల్ ఇచ్చేశారు.
తాజాగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణంలో మరో చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ సినిమా నేడు జూన్ (22) ఉదయం 11.16 నిమిషాలకు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో అతిరథుల మధ్య వైభవంగా ముహూర్తం జరుపుకుంది.
ఇంతకముందు ఎప్పుడు చూడని మాస్ రోల్లో కనిపించబోతున్నట్లు తెలిపారు. “రేయ్ రాముడు లంక మీద పడ్డం ఇనుంటావ్. అదే పది తలకాయలోడు అయోధ్య మీద పడితే ఎట్టుంటదో సూస్తావా…” అని చిత్రంలో ప్రతినాయకుడు పాత్ర హెచ్చరిక గా అంటే.. “ఈ అయోధ్యలో ఉండేది రాముడు కాదప్పా.. ఆ రావణుడే కొలిసే రుద్ర కాళేశ్వరుడు.. సూస్కుందాం రా.. తలలు కోసి సేతికిస్తా నాయాలా..!” అంటూ వైష్ణవ్ గంభీరంగా చెప్పే డైలాగ్ అదిరిపోయింది. 2023 సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభంకానుందని పేర్కొన్నారు.
కాగా, ‘పీవీటీ04′(వర్కింగ్ టైటిల్) పేరుతో రూపొందనున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహించారు. శ్రీలీల హీరోయిన్.పీడీవీ ప్రసాద్ సమర్పకులు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్టూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నాగవంశీ-సాయి సౌజన్య నిర్మాతలు. ఇక వైష్ణవ్ నటించిన ‘రంగరంగ వైభవంగా’ గిరీశయ్య దర్శకుడు. కేతికశర్మ హీరయిన్. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
విజయ్ దేవరకొండపై “ఫలక్నుమా దాస్” కామెంట్స్ ?